ఏపీ రాజకీయాల్లో ఇప్పు కొత్త సర్వే హాట్ టాఫిక్గా మారింది. వచ్చె ఎన్నికల్లో పులివెందులతో సహా అన్ని సీట్లు గెలుస్తామని ఏకంగా చంద్రబాబె సెలవిచ్చారు. కాని ఇప్పుడు మరో సర్వే హల్ చల్ చేస్తోంది. అదే ఎన్నికల్లో వైసీపీ 137 స్థానాలను కైవసం చేసుకుంటామని జగన్ చెప్పారనె వార్త ఇప్పుడు సంలనంగా మారింది.
అయితె ఈ వార్తను ప్రముక పత్రిక ప్రచురించింది. 1994 ఎన్నికల సందర్భంగా తిరుపతిలో ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి 227 సీట్లు వస్తాయని ప్రకటించారు. అదేమి లెక్క అని మీడియా అడిగితే రాకపోతే అడగండి అంటూ సవాలు విసిరి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఫలితాలు చూస్తే దాదాపు అన్నే సీట్లు వచ్చాయి. అటువంటిది చాలా రేర్ గా జరుగుతుంది.
గొర్లగుంటలో మీడియా మిత్రులతో మాట్లాడుతూ తమ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 137 స్ధానాల్లో గెలుస్తుందని ఢండా భజాయించి మరీ చెప్పారంట. బహుశా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ఏమైనా సర్వేలు నిర్వహించి నివేదిక ఇచ్చారా అన్న అనుమనాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ప్రశాంత్ కొంతకాలంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సర్వేలు కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
2014లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలల్లో ఫలితాలు వచ్చాయి. కాని తీరా ఫలితాల దగ్గరి కొచ్చే సరికి బొక్కబార్లా పడిన సంగతి తెలసిందే. సర్వేలను చూసి మోసపోయాడవె విమర్శలు వచ్చాయి. ఇప్పుడుకూడా అలానె బోల్తాపడతాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు జగన్ ఈ విషయం చెప్పాడా లేదా అన్నది క్లారిటీలేదు. ఏమో చివర్లో గుర్రం ఎగరవచ్చేమో…?