- Advertisement -
ఎన్నికల ప్రాచారంలో మాటలయుద్ధం పార్టీ నేతల మధ్యే కాదు సినిమా స్టార్ ల మధ్య కూడా కౌంటర్లు, ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీకి సినీ గ్లామర్ ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మధ్యనే వైసీపీకి సినీ గ్లామర్ మరింత పెరిగింది. తాజాగా వైసీపీ నేత అలీ, టీడీపీ మహిళా నేత దివ్వవాణ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. వైసీపీలో చేరినందుకు అలీ ప్యాకేజీ ఎంత తీసుకున్నారో దివ్వవాణి చేసిన వ్యాఖ్యలపై అలీ మండిపడ్డారు. మరో సారి విమర్శించకుండా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ‘ప్యాకేజీ తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు మీరు చూశారా.. లేక సెల్ఫీ తీశారా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘టీడీపీలో చేరినందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్తారా’ అని ఎద్దేవా చేశారు.