స్పీకర్ పదవిని భ్రష్టుపట్టించేలా కోడెల వ్యవహరిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు పాలాభిషేకం చేయడంపై మండి పడ్డారు. బాబు మీద అంత అభిమానమే ఉంటే వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేసి పాలాభిషేకం చేయాలని అంబటి డిమాండ్ చేశారు.
స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యంగా, తటస్థంగా వ్యవహరించాలని సూచించారు. స్పీకర్ కోడెల తీరు బాధాకరమన్నారు.ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతున్న కోడెల శివప్రసాదరావు వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం దుబారా కార్యక్రమాలు చేస్తోందని మండిపడ్డారు. పంటి వైద్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారని, మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో లేదని వ్యాఖ్యానించారు.