ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేత బాలశౌరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికే వైఎస్ఆర్, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయని ….ఇక బాబు బయోపిక్ తీస్తే బాగుంటుందన్నారు. బాబు బయోపిక్కు మహానగరంలో మాయగాడు‘.. ‘యూటర్న్ మోసగాడు’ అనే పేర్లు కరెక్ట్గా సరిపోతాయని ఎద్దేవ చేశారు.
చంద్రబాబు సీఎం అయినప్పటినుంచి గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజల చెవిల్లో పువ్వులు పెట్టారని విమర్శించారు. పాదయాత్రలో జగన్కు వస్తున్న పాదయాత్రకు వస్తున్న ప్రజా మద్దతును చూసి అబ్బా, కొడుకులకు నిద్రరావడంలేదన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని..జగన్ సీఎం కావడం తథ్యమన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలను ఎన్ని వందల కోట్లు పెట్టి కొనుగోలు చేశారో చెప్పాలన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో అమలుపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం ఉందాని బాబుని ప్రశ్నించారు.హైకోర్ట్ కట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని, హైకోర్టు కట్టలేక సాకులు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.