వైసీపీ అధినేత జగన్పై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఇన్నాల్లు చూసి చూడనట్లు వ్యవహరించిన నేతలు ఇప్పుడు స్పీడ్ పెంచారు..శుక్రవారం కాకినాడలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో అనిల్ కుమార్ పవన్పై నిప్పులు చెరిగారు. ఓట్లకోసమే…పదే పదే కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటున్న పవన్….చిరు తమ్ముడినని చెప్పుకొలేని దౌర్భాత్య స్తితిలో ఉన్నావంటూ ఘాటు విమర్శలు చేశారు.
అన్న పేరు చెప్పుకోలేని నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రతి సభలోనూ కులాన్ని ప్రస్తావించే నాయకుడే పవన్ కల్యాణ్ అని తీవ్రంగా దుయ్యబట్టారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగనే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్, జనసేనలు పని చేస్తున్నాయని, ప్రజలు జాగరూకతతో వచ్చే ఎన్నికల్లో ఓట్లేయాలని కోరారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది వైఎస్సార్, ఎన్టీఆర్లేనని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ పప్పులుడకవని టీడీపీ, కాంగ్రెస్లతో పాటు జనసేనలు లోపాయకారిగా జతకట్టాయని ఆరోపించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగితే హుందాగా నడుచుకుంటూ వెళ్లిన సంగతి గుర్తు చేశారు. వైఎస్ జగన్ పేరు వింటేనే చంద్రబాబు వణికిపోతున్నారని, దొంగకూటమిని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం వైఎస్ జగన్కు ఇస్తే తండ్రిని మించిన పాలన అందిస్తారని అన్నారు.