వైసీపీ ఎమ్మెల్యే రోజా మరో సారి చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు. పరీక్షల్లో కాపీ కొడిత విద్యార్థులను డీబార్ చేస్తారని ….అలాంటప్పుడు నవరత్నాలను కాపి కొట్టిన బాబు ఏం చేయాలని నిలదీశారు. బాబు చైనాపోన్ లాంటి వ్యక్తిఅని అయన బుర్రలో ఎలాంటి ఫీచర్ ఉండదని సెటైర్స్ వేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వరం కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యాక్ ర్యాలీలో పొల్గొని ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో రోజా పాల్గొన్నారు.
చంద్రబాబు క్స్పైర్ అయిన ట్యాబ్లెట్… వేసుకోవడం వల్ల ఉపయోగం ఉందంటూ సెటైర్లు వేశారు. ఎక్స్పైర్ అయిన టేబ్లెట్ వేసుకుంటే మనిషి చనిపోతాడని అలాంటి అవుట్ డేటెడ్ చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రం చచ్చిపోతుందంటూ ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలను అప్పులపాలు చేసిన చంద్రబాబుకు పసుపు కుంకుమల విలువ తెలియదని మండిపడ్డారు. రాష్ట్రంలో లోకేష్ కి తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదని వ్యాఖ్యానించారు.
మహిళలను వ్యాపార వేత్తలుగా చేయడం ఏమో కాని తన కోడలి బ్రాహ్మణిని మాత్రం పారిశ్రామిక వేత్తగా మార్చారంటూ ఎద్దేవా చేశారు. మద్యపానం వల్ల మహిళలలు ఇబ్బందులు పడుతుంటే గుడి, బడి అనే తేడా తెలియకుండా బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చారని ధ్వజమెత్తారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతీ మహిళను వైఎస్ జగన్ ఆదుకుంటారని తెలిపారు