Thursday, May 16, 2024
- Advertisement -

పార్టీని అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ క‌ష్టాలు ప‌డుతుంటె.. ఎమ్మెల్యేలు షాక్ ల‌మీద షాకులిస్తున్నారు….

- Advertisement -

వైసీపీకి ఫిరాయింపుల క‌ష్టాలు వీడ‌టంలేదు. పార్టీని వీడుతున్న నేత‌ల‌ను ఆప‌డంలో జ‌గ‌న్ నిర్వ‌క్ష్యం వ‌హిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి పార్టీలో చేరుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితె తాజాగా ఇప్పుడు జ‌గ‌న్‌కు బిగ్‌షాక్ త‌గ‌ల‌నుంది. మ‌రో ఎమ్మెల్యే ప‌చ్చ ఖండువా క‌ప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో త‌ర్వ‌లో రెండు వికెట్లు ప‌డ‌నున్నాయి.

ఒక వైపు వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు జగన్ అష్టకష్టాలు పడుతుంటే.. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ కి షాక్ లు మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే 22మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. కాగా.. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా పార్టీలో చేరతారనేది ఫిక్స్ అయ్యింది. ఆమెను పార్టీ నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకు స్వయంగా జగనే రంగంలోకి దిగి బుజ్జగింపులు విఫ‌ల‌మ‌య్యాయి. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యే జగన్ కి షాక్ ఇచ్చాడా?.

ప్ర‌స్తుతం జగన్ ప్రజా సంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో సాగుతోంది. ఆయనకు జిల్లావాసులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన పాదయాత్ర ఇంకా కర్నూలు జిల్లాలో ముగియక ముందె ఆధోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది. అందుకు బ‌ల‌మైన కార‌నమే ఉంది.

సాయి ప్రసాద్ రెడ్డి.. టీడీపీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. దీంతో అందరూ ఆయన టీడీపీలో చేరడం ఖాయమని చర్చించుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయని ఎమ్మెల్యే అన్నాడు. అక్కడితో ఊరుకున్నాడా…! వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల క్వాలిటీ చాలా చీప్ గా ఉందని విమర్శించాడు. దీంతో ఈయన సైకిల్ ఎక్కాలనుకుంటున్నాడని.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడనే వాదనలు వినపడుతున్నాయి.

ఫిరాయింపుల విష‌యంలో జ‌గ‌న్ ఏంచేస్తున్నార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పాద‌యాత్ర ముగిసేలోపు ఎంత‌మంది పార్టీలో ఉంటారో అంతు చిక్క‌డంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -