Saturday, May 4, 2024
- Advertisement -

స‌భ నిర‌వ‌ధిక‌ వాయిదా కంటే ముందే రాజీనామా ప‌త్రాల‌ను స్పీక‌ర్‌కు అందించిన వైసీపీ ఎంపీ

- Advertisement -

ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు అంతిమ పోరాటాన్ని ప్రారంభించింది. హోదా సాధన పోరాటంలో భాగంగా నేడు పదవులకు రాజీనామాలు చేయనున్న సంగ‌తి తెలిసిందే.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పీవీ మిధున్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలుత నేడు పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన తరువాత ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు చెప్పిన ఆయన, అనూహ్యంగా సభ ప్రారంభానికి గంట ముందే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను మిధున్ రెడ్డి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్‌ కు పంపారు. స్పీకర్ ఫార్మాట్ లోనే లేఖను అందించానని ఆయన తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -