జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మే 15 నుంచి గ్రామ స్వరాజ్యం పేరుతో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టేనుననారు. ఇందుకోసం ప్రత్యేకించి ఒక వాహనాన్ని కూడా జనసేన సిద్ధం చేసింది. ఇంకా ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో.. ఇక ప్రజల్లో ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారు.
జనసేనుడు తన బస్సు యాత్ర కు ముందు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన తిరుపతికి చేరుకున్నారు, ఆదివారం ఉదయం కాలినడకన కొండ ఎక్క స్వామివారి దర్శనం చేసుకున్నారు.
పవన్ చేస్తున్న బస్సుయాత్రపై వైసీపీ ఎంపీ విజయసాయి స్పందించారు. ఆయన చేస్తున్న యాత్రను స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు తాను బస్సు యాత్ర చేపట్టినట్టు పవన్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.
సమస్యలపై ఎవరు పోరాటం ప్రారంభించినా తనకు సంతోషమేనని చెప్పారు. సమస్యలపై కదిలిన పవన్ ను అభినందించాల్సిందేనని, సమస్యలకు పరిష్కారం లభిస్తే ఇంకా ఆనందమని వ్యాఖ్యానించారు. కాగా, పవన్ బస్సు యాత్ర చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకూ సాగనుందన్న సంగతి తెలిసిందే.