Thursday, May 23, 2024
- Advertisement -

బాబు లాంటి ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ నేర‌గాడు ప్ర‌పంచంలో ఎవ‌రూ లేరు …వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

- Advertisement -

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ఊస‌రి వెల్లిలాగా చంద్ర‌బాబుకు రంగులు మారుస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో బాబుకు చిత్త‌శుద్ధిలేద‌ని విమ‌ర్శించారు. ఉద‌యం 9.30 గంటల వరకు ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు గం 9.31కి ఎన్డీఏతో విడిపోయి, ఒకే ఒక్క నిమిషంలో తన ఆలోచన తీరును మార్చేసుకున్నారని అన్నారు.

బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలంటే రాజకీయాలను పక్కనబెట్టి పోరాడాలని, అవిశ్వాస తీర్మానానికి నోటీసులను తాము నిన్నే అందించామని, ఈ రోజు 9.31 గంటలకి టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిందని అన్నారు. ఒకే ఒక్క నిమిషంలో చంద్ర‌బాబు తన నిర్ణ‌యం మార్చుకున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్డీఏపై అవిశ్వాసానాకి అన్ని రాజకీయ పార్టీల మద్దతుని వైసీపీ కోరిందని, జగన్ ఏది చేసినా చిత్తశుద్ధితో పనిచేస్తారని అన్నారు. చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే ఆయనకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. ఆర్థిక‌, రాజ‌కీయ, సామాజిక నేర‌గాడు చంద్ర‌బాబు నాయుడు అని ఆయన ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -