చంద్రబాబునాయుడు, మంత్రులపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. జగన్ చేపడుతున్న పాదయాత్రను చూసి ఓర్వలేకె టీడీపీ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటిపై తెలంగాణాలో ఒకలా …ఏపీలో మరో లా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేటి పట్టిసీమ ఆనాడు దివంగత మహానేత వైయస్ తవ్వించిన కుడి కాలువ వల్లే సాధ్యమైందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
మంత్రి ఉమ పెద్ద బ్రోకర్.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తే… నీరు, రైతులు, పంటలు, సేద్యం గురించి తెలియదంటూ మంత్రులు పిచ్చిపిచ్చి వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ తానే తెచ్చానని చెబుతున్న మంత్రి దేవినేని ఉమా పెద్ద బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్. కాంట్రాక్టర్లకు, చంద్రబాబుకు, లోకేష్కు మధ్య మంత్రి దేవినేని ఉమా బ్రోకర్గా పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
ఏపీలో 420 ఎవరో తెలుసు.. ఆఖరికి అర్ధరాత్రి మంత్రి పదవి తెచ్చుకున్న బీర్ హెల్త్ డ్రింక్ అని చెప్పే మంత్రి జవహర్ కూడా జగన్ పాదయాత్ర పేరు 420 పెట్టి సినిమా తీయమని చెబుతుండడాన్ని జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఏ పిల్లాడ్ని అడిగినా ఖచ్చింగా చంద్రబాబు-420 అని చెబుతారని ఎద్దేవా చేశారు.