జియో ఇచ్చిన దెబ్బతో ఇతర టెలికాం కంపెనీలు కొత్త కొత్త ఆఫర్స్ ని తీసుకొస్తున్నాయి. కొత్త యూజర్లను ఆకర్శించేందుకు అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. ఇదే క్రమంలో బీఎస్ఎన్ఎక్ కూడా కొత్త వినియోగదారుకను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.
కేవలం రూ.49కే అన్లిమిటెడ్ కాల్స్ సదుపాయాన్ని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ల్యాండ్ లైన్ కస్టమర్లను పెంచుకోవడానికి బీఎస్ఎన్ఎల్ ‘ఎక్స్పిరియెన్స్ ఎల్ఎల్ 49’ పేరిట కొత ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్ వర్క్లకు అన్ని ఆదివారాల్లో 24 గంటల పాటు, మిగితా రోజుల్లో రాత్రి 9 నుంచి ఉదయం 7 వరకు నిరంతరంగా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది ఫిక్స్డ్ నెల ఛార్జి అని, ఆరు నెలల పాటు దీనికి వ్యాలిడిటీ ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
అంతేకాకుండా ఈ ఆఫర్ తో పాటు బీఎస్ఎన్ఎల్ ప్రిపెయిడ్ సిమ్ కార్డు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపింది. కాగా.. రెండు రోజుల క్రితం 3జీ 1జీబీ డేటా రూ.36కే అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ న్యూ ఆఫర్ ద్వారా దేశంలో టెలికం మార్కెట్ లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్లు భారీగా పెరుతాయని అంచనా వేస్తున్నారు.
Related