మొట్టమొదటసారిగా అత్యంత ఖరీదైన ,అత్యంత వేగవంతమైన కారు మొదటిసారిగా రోడ్డమీదకు రానుంది. ప్రపంచంలో ఖరీదైన కార్ల జాబితాలో ఆకారు ఉండాల్సిందే. ఇప్పటి వరకు షోరూంలకే పరిమిత మయిన హైస్పీడ్ కారు ఇప్పుడు రోడ్లమీద హల్చల్ చేయనుంది. దీని విలువ దాదాపు రూ.19 .21 కోట్లు. దీని అత్యంత వేగం గంటకు 420 కి.మీ. దానిపేరు బుగాట్టీ చిరాన్.
విలాసవంతమైన కార్లకు చిరునామాగా నిలిచే బుగాట్టీ చిరాన్పేరుతో కొత్తకారును మార్కెట్లోకి తీసుకొచ్చింది కంపెనీ. తొలికారును అమెరికాలోని పెబల్బీచ్లోని ఒక కస్టమర్కు డెలివరీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 500 కార్లను మాత్రమే విక్రయిస్తారు. వీటిల్లో సగానికిపైగా ఇప్పటికే బుక్అయ్యాయి. ప్రస్తుతం డెలివరీ అయిన చిరాన్ను నలుపు తెలుపు రంగుల్లో తయారు చేశారు. ప్రస్తుతం ఇది పెబల్ బీచ్లో ఆకర్షణగా మారింది.
ఈ కారు 1.600 ఎన్ఎం టార్క్ వద్ద 1500 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. అత్యంత సౌకర్యవంతమైన ఇంటీరియర్తో దీనిని తీర్చిదిద్దారు. దీనిలో 8లీటర్ డబ్ల్యూ16 ఇంజిన్ను వినియోగించారు. దీనిలో రెండుదశల టర్బోఛార్జర్ ఇంజిన్ ఉంది. ఈ టెక్నాలజీని బుగాట్టీ తొలిసారి వినియోగిస్తోంది.
ఇది అత్యధికంగా గంటకు 420 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇంత వేగంలో కూడా డ్రైవర్కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కారును డిజైన్ చేశారు. ఇప్పటి వరకు మనం హైస్పీడ్ అంటె బుల్లెట్ ట్రైన మాత్రమే గుర్తుకొస్తుంది. దీన్ని తలదన్నే రీతిలో ఈ కారు వేగం ఉండటం గమనర్హం.