Friday, April 26, 2024
- Advertisement -

ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు బోల్తా..!

- Advertisement -

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మంది పర్యటకులతో భువనేశ్వర్ వెళ్తున్న టూరిస్ట్​ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన గజపతి జిల్లా అదబా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ​దుంబులా చౌక్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు భువనేశ్వర్​కు చెందిన సునీల్ సాహుగా గుర్తించారు పోలీసులు. క్షతగాత్రులను మోహన కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు తరలించారు. కోరాపట్​ జిల్లాలోని గుప్తేశ్వర్​ ఆలయ దర్శనం అనంతరం పర్యటక బస్సు భువనేశ్వర్​ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -