ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త నాటకానికి తెరతీశారు. బాబు అవినీతి చుట్టూ కేంద్రం ఉచ్చు బిగిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అనూహ్యంగా గవర్నర్ నరశింహన్ను టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయీల్లో సంచలనంగా మారింది. ప్రధానంగా చంద్రబాబును కేంద్రం ఏదో చేస్తుందోనన్న అభద్రతా భావంతో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇన్నాల్లు గవర్నర్ను పల్లెత్తు మాట అనని బాబు ఇప్పుడు కొత్తగా గవర్నర్ను విమర్శించడం అందరిలోనూ అసక్తిని కలిగిస్తోంది. గవర్నర్ తనకు వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేస్తున్నాడు అని చంద్రబాబు గవర్నర్పై విమర్శలను ఎక్కుపెట్టారు. నరసింహన్ తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని, తనపై కుట్ర జరుగుతోందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు.
ఈ విషయం పక్కనపెడితే.. అసలు విషయానికి వద్దాం ఇప్పుడు. బాబుకు ఇన్నాళ్లు ముద్దు అయిన గవర్నర్ ఇప్పుడు చేదుగా మారారు. 2014 లో అధికారం చేపట్టినప్పటనుంచి ఇదే గవర్నర్ చేత చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కి వ్యతిరేకంగా ఏమేం పనులు చేయించాడో అందరికీ తెలిసిందే.
రాజ్యాంగాన్ని కాపాడాల్సి గవర్నర్ కూడా బాబు చెప్పినట్టే చేసి విలువలను తుంగలోకి తొక్కారు. గవర్నర్ చేత అప్రజాస్వామ్యికంగా వ్యవహరింపజేసి ఫిరాయించిన నేతలలో నలుగురిని గవర్నర చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించింది చంద్రబాబు కాదా….? అప్పుడేమో గవర్నర్ ముద్దు ఇప్పుడేమో చేదు అయ్యారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీ వైపు ఎమ్మెల్యేలను తెచ్చి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించమని తను చెబితే ఇదే నరసింహన్ మారు మాట్లాడకుండా ఆ పని చేసి పెట్టాడు. వాళ్ల చేత ప్రమాణస్వీకారం చేయించాడు. అప్పుడు మాత్రం గవర్నర్ చంద్రబాబుకు మంచివాడు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి చంద్రబాబు, నరసింహన్ లు ఆ పని చేశారు. ప్రజాస్వామ్యానికి కాపలాగా ఉండాల్సిన పెద్ద మనుషులు అలాంటి పని చేశారు.
అప్పుడు గవర్నర్ తీరు సరికాదని చంద్రబాబుకు అనిపించలేదు. ఇప్పుడు మాత్రం నరసింహన్ తనపై ఏదో కుట్ర చేస్తున్నాడని చంద్రబాబు బేల మాటలు మాట్లాడుతున్న తీరు చూస్తే బాబు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోంది.