Saturday, May 4, 2024
- Advertisement -

ముగ్గురిలో ఎవ‌రికి చ‌రిష్మా ఎక్కువ‌

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌ద‌రంగంలో ముగ్గురే ఇప్పుడు రాజులుగా క‌నిపిస్తున్నారు. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్.. ఈ ముగ్గురిలోనే ఎవ‌రో ఒక‌రు వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నార‌న్న‌ది సుస్ప‌ష్టం. అయితే.. వీరి ముగ్గురిలో ఎవ‌రు అత్య‌ధిక ఛ‌రిష్మా ఉన్న నాయ‌కుడ‌నే విష‌యంపై అంద‌రిలోనూ ఆస‌క్తి ఉంది. ఈ ముగ్గురూ ఎవ‌రికి వారే ధీటైన వార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. చంద్ర‌బాబు గురించి చెప్పుకుంటే.. ఇప్పుడు నిరూపించుకోవాల్సింది.. త‌న గురించి కొత్త‌గా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ప‌రిపాల‌న ప‌రంగా మంచి అడ్మినిస్ట్రేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ముఖ్య‌మంత్రి. దేశంలోనే ఇంత అనుభ‌వం ముఖ్య‌మంత్రిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఉన్న వారిలో చంద్ర‌బాబు అగ్ర‌స్థానంలో ఉంటారు. అందుకే.. దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా.. అక్క‌డి యువ‌త నుంచి అంద‌రూ చంద్ర‌బాబు గురించి గొప్ప‌గా చెప్ప‌డం.. అడ‌గ‌డం చేస్తుంటారు. కానీ.. గ‌త నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌నపై అనేక ఫిర్యాదులున్నాయి. గ‌తంలో మాదిరిగా చంద్ర‌బాబు పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త‌, ప‌రిపాల‌న‌పై ప‌ట్టు చూపించ‌లేక‌పోయార‌నే అప‌వాదు ఉంది.

వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి సైతం మంచి ఛ‌రిష్మా ఉన్న నాయ‌కుడే. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై ఉన్న అభిమానం మొత్తాన్ని ప్ర‌జ‌లు అలాగే జ‌గ‌న్‌పైకి షిఫ్ట్ చేశారు. దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పే స్థాయి ఉన్న యువ నాయకుల్లో జ‌గ‌న్ కూడా ఒక‌రు. జ‌గ‌న్ సైతం ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే స్వ‌భావం, హావ‌భావాలున్న మాస్ నాయ‌కుడు. చంద్ర‌బాబుతో పోలిస్తే.. మాస్ నాయ‌కుడిగా జ‌నంలో జ‌గ‌న్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇంక ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చెప్పుకుంటే.. సినిమా న‌టుడు కావ‌డంతో చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రికంటే ఛ‌రిష్మా ఉన్న నాయ‌కుడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను నాయ‌కుడు అనేకంటే.. ప‌వ‌ర్ స్టార్ అనే ఇప్ప‌టికీ అభిమానుల‌తో పాటూ సాధార‌ణ సినీ ప్రేక్ష‌కులు సైతం పిలుచుకుంటూ ఉంటారు. సాధార‌ణంగానే సినిమా న‌టుడు.. అదికూడా కోట్లాది మంది అభిమానులున్న న‌టుడు కావ‌డంతో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డికి వ‌చ్చినా.. జనం పోటెత్తుతుంటారు. ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా ఇదే ప్ర‌భంజ‌నం కొనసాగుతుందా.. అంతే సందేహ‌మే.

ఎవ‌రు ముఖ్య‌మంత్రని తేల్చ‌డం క‌ష్ట‌మే..
చంద్ర‌బాబుకు మంచి పాల‌న ద‌క్షుడిగా ఛ‌రిష్మా ఉంటే.. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మాస్ నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. ఇంక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స్టార్‌డ‌మ్ పాపులారిటీ ఉంది. అంటే.. ఎలా చూసినా.. ఈ ముగ్గురిలో ఛ‌రిష్మా ఉన్న నాయ‌కుడు ఎవ‌ర‌నేది తేల్చ‌డం క‌ష్టమే. ముగ్గురూ ఛ‌రిష్మా ఉన్న‌వాళ్లే. ముగ్గురిలోనూ ఒక్కో క్వాలిటీ ఉంది. జ‌నంలో ఛ‌రిష్మా అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మంచి ముఖ్య‌మంత్రిగా ఎంపిక చేసుకోమంటే.. చంద్ర‌బాబు. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి వార‌స‌త్వం పుణికిపుచ్చుకుని మంచి మాస్ లీడ‌ర్ గా జ‌గ‌న్‌కు గుర్తింపు ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌డి రాష్ట్రంతో క‌లిపితే.. ఇప్ప‌టికే చంద్ర‌బాబును అప్పుడో తొమ్మిదేళ్లు.. ఇప్పుడో ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా జ‌నం చూశారు. మ‌ళ్లీ ఆయ‌న వ‌స్తారా.. లేక ఈసారి జ‌గ‌న్‌, ప‌వ‌న్‌లో ఎవ‌రో ఒక‌రు అవుతారా.. అనేది ప్ర‌స్తుతానికి తేల్చ‌డం క‌ష్టం. రాష్ట్రంలోని రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసేవారెవ‌రైనా ఇదే మాటంటారు. ప‌క్క‌న తెలంగాణ‌లో మ‌ళ్లీ కేసీఆర్ వ‌స్తాడ‌ని చెప్పేంత గ్యారెంటీగా.. ఆంధ్ర‌లో చెప్పే ప‌రిస్థితి లేదు. తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత బ‌లంగా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెందిన జ‌న‌సేన లేద‌నేది వాస్త‌వ‌మే. కానీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి కాలేడ‌ని మాత్రం చెప్ప‌డం సాధ్యం కాదు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న‌వే 175 సీట్లు.. గ‌ట్టిగా ఎవ‌రికీ ఓ 90 సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అందుకే.. ఓ పాతిక సీట్లు తెచ్చుకుంటే ప‌వ‌న్‌కూ ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చునే అవ‌కాశం రావొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -