Thursday, May 2, 2024
- Advertisement -

స్కూల్ బ్యాగ్ బరువు మోయలేక విద్యార్థిని మృతి..!

- Advertisement -

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్కూల్లో పిల్లలకు అవసరంకు మించి చదువును చెప్పేస్తున్నారు. ఆ వయసులో వారికి అవసరం లేని బుక్స్ ని చదించేస్తున్నారు. దాంతో వారు స్కూల్ కి తీసుకెళ్లాల్సిన బుక్స్ కంటే ఎక్కువగా తీసుకెళ్తున్నారు. ఇలా పుస్తకాల బ్యాగ్ బరువు ఓ బాలిక ప్రాణం తీసింది.

ఈ దారుణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి విషయంలోకి వెళ్తే.. వరంగల్‌ లోని కరీమాబాద్‌ తోట్లవాడకు చెందిన పవుడాల కుమారస్వామి, శోభ దంపతులకు ముగ్గురు సంతానం. వారంతా స్థానిక కౌటిల్య హైస్కూల్‌ లో చదువుతున్నారు. పెద్దకుమార్తె శ్రీవర్షిత (14) 9వ తరగతి చదువుతోంది. రోజులాగే స్కూల్ కు పుస్తకాల బ్యాగుతో వెళ్లింది. మూడో అంతస్తులోని తరగతి గదిలోకి వెళ్లేందుకు 12 కేజీల బరువున్న బ్యాగుతో మెట్లెక్కింది. తీరా తరగతి గదికి వెళ్లేలోపు బాల్కనీలో ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. పాఠాశాల నిర్వాహకులు ఆమెకు దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

అనంతరం ఆ ఆసుపత్రి నుంచి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా, ప్రాణాలు విడిచింది. దీంతో శ్రీవర్షిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పుస్తకాల బ్యాగు అతి బరువు, తరగతి గది మూడో అంతస్తులో వుండటమే విద్యార్థిని మృతికి కారణమని అభిప్రాయపడుతుండగా.. విద్యాశాఖ నిబంధనల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థుల పుస్తకాల బ్యాగు బరువు 6 కేజీల లోపే ఉండాల్సి ఉంటుంది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా బాలిక బండెడు పుస్తకాలు మోయాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -