దేశవ్యాప్తంగా డేరాబాబా రాసలీలలు ఓ కుదుపు కుదేపేసిన విషయం తెలిసిందే. అది మర్చిపోకముందే బెంగళూరులో ఓ స్వామీజీ కుమారుడి బాగోతం బయటపడింది. కర్ణాటకలోని ఎలహంకలో హుణసేమారేనహళ్ళి మఠాధిపతి పర్వతరాజు బాబాగా ఉన్నారు. 500ఏళ్ల చరిత్రకలిగిన హుణసేమారేనహళ్ళి మఠానికి అక్కడ చాలా మంచి ప్రముఖ్యత ఉంది. ఈ మఠానికి పర్వతరాజు పీఠాధిపతిగా చాలా ఏళ్లుగా ఉంటున్నారు.
ఆయనకు ఇద్దరు భార్యలు. రెండో భార్య కొడుకు దయానంద పదో తరగతిలో డీబారై, జులాయిగా తిరుగుతున్నాడు. అతను బాగా జల్సా లైఫ్ కి అలావాటు పడ్డాడు. అమ్మాయిలతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తుంటాడు. మఠానికి వచ్చిన వారిని ఏదోలా లోబరచుకునేవాడు. అతడిని 2011లో పీఠాధిపతిగా చేసేందుకు పర్వతరాజు ప్రయత్నించారు. అయితే అక్కడ వారు ఒప్పుకోకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా అతడు ఓ ప్రముఖ కన్నడ నటితో రాసలీలలు చేస్తోన్న వీడియో బయట పడింది. ఇది కన్నడ నాట మీడియాతో పాటు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇవి బయటకు రావడంతో దయానందతో పాటు సదరు హీరోయిన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవల పర్వతరాజు ఆరోగ్యం బాలేకపోవడంతో.. దయానంద మరింతగా రెచ్చిపోతున్నారు.
మఠాన్నే వేదికగా చేసుకుని జల్సాలు చేస్తున్నాడు. మూడు ప్రముఖ కన్నడ సినిమాల్లో నటించిన ఓ హిట్ హీరోయిన్తో అతడికి అక్రమ సంబంధం ఉందని టాక్. ఆమె నటించే తాజా సినిమాకు దయానంద నిధులు కూడా సమకూరుస్తున్నట్టు టాక్. ఈ క్రమంలో మఠంలోని ఓ గదిలో ఆమెతో దయానంద రాసలీలలు జరిపిన దృశ్యాలు బయటకు వచ్చాయి. వీడియో లీక్ కావడంపై సదురు హీరోయిన్ హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.