Friday, May 17, 2024
- Advertisement -

‘జగన్‌ నిజాయితీ నీలో లేదు’…. బాబుపై టిడిపి లీడర్ డైరెక్ట్ ఎటాక్

- Advertisement -

క్షవరం అయితే కానీ తత్వం బోధపడదు అన్న సామెత ఆ టిడిపి నాయకుడికి తెలిసొచ్చింది. బాబు నిజస్వరూపం అర్థమైంది. అప్పటికీ మాటలతో బురిడీ కొట్టించాలని చూసిన చంద్రబాబుతో ‘యువకుడు అయిన జగన్‌లో ఉన్న నిజాయితీ నీలో ఒక్క శాతం కూడా లేదు’ అని డైరెక్ట్‌గా చంద్రబాబుపైనే డైరెక్ట్‌గా ఎటాక్ చేశాడు. అనుభవజ్ఙుడిని అని చెప్పుకుంటూ అధికార స్వార్థం కోసం పని చేస్తున్నావు అని చంద్రబాబు రాజకీయాన్ని కడిగి పారేశాడట ఆ నాయకుడు.

అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు గురునాథరెడ్డి అనుచరులు ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే టైంకి జగన్‌కి ఝలక్ ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డికి ఎమ్మెల్సీ ఆశ చూపించి పార్టీలో చేర్చుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చే అవకాశం లేదని పచ్చ మీడియాతో ప్రచారం చేయించాడు. అదే విషయంపై చంద్రబాబును గురునాథరెడ్డి నిలదీస్తే…..‘నన్ను నమ్ము…నేను చూసుకుంటా’ అని బాబు అన్నాడట. అయితే గురునాథరెడ్డి మాత్రం డైరెక్ట్‌గానే….. పదవీ స్వార్థం కోసం ఏమైనా చేస్తావు……..నిన్నెలా నమ్ముతాను…..జగన్‌లో ఉన్న నిజాయితీలో ఒక్క శాతం కూడా నీలో లేదు…..’ అని చెప్పి ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోయాడట గురునాథరెడ్డి.

చంద్రబాబు మార్క్ కపట రాజకీయాలతో ఒక్క సంవత్సరంలోనే విసిగిపోయానని, భూమా నాగిరెడ్డిలాంటి పరిస్థితి నాకు రాకూడదంటే టిడిపిని వీడడమే మంచిదని అనుచరులతో అభిప్రాయపడ్డాడట. జగన్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపు కోసం కష్టపడతానని చెప్తున్నాడట గురునాథరెడ్డి. ఆల్రెడీ విజయసాయిరెడ్డికి టచ్‌లోకి వెళ్ళిన ఈ నాయకుడి విషయంలో జగన్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -