Thursday, March 28, 2024
- Advertisement -

మీకు బ్లాక్ మనీ ఉందా ? మీకు త్వరలో పిచ్చి ఎక్కుతుంది – డాక్టర్ లు చెబుతున్నారు 

- Advertisement -
If you have Black Money..? You will become a mad

ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాజకీయ భావజాలంతో కొందరు అనుకూలంగా మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతుండగా ఆర్తికవేత్తలు కూడా దీని పర్యవసానాలు మంచీచెడులు విశ్లేషిస్తున్నారు. అయితే… తాజా వెల్లడైన సరికొత్త విశ్లేషణ చూసి చాలామంది షాక్ తింటున్నారు. నోట్ల రద్దు కారణంగా భారతదేశంలో పిచ్చోళ్ల సంఖ్య పెరగబోతోందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జీవితంలో ఎన్నో కష్టాలు పడి… ఎన్నో త్యగాలు చేసి… సక్రమంగానో అక్రమంగా సంపాదించిన డబ్బు మార్చుకోవడానికి వీల్లేకపోవడంతో ఎంతో మంది మానసిక రుగ్మతల బారిన పడి ఇతరులపై దాడులకు దిగే ప్రమాదముందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అంశం లెక్కలోకి రాని ధనాన్ని దాచుకున్న వారికి ఓ పెద్ద భూకంపం లాంటిదని అభివర్ణించారు. దాన్నుంచి తప్పించుకునే మార్గం తెలియకవారు ఏమైనా చేయవచ్చని తెలిపారు. గడువు తరువాత తమ వద్ద  డబ్బును మార్చుకోలేకపోతే ఆ షాక్ నుంచి కోలుకోలేక  పిచ్చోళ్లయ్యే ప్రమాదముందని చెబుతున్నారు.

అంతేకాదు.. కళ్లముందే నోట్ల కట్టలుగా చిత్తుకాగితాలుగా మారిపోతే ఏం చేయాలో తెలియని ఎంతో మందికి గుండెపోటు వంటి రోగాలు రావచ్చని వీరి గురించి కుటుంబ సభ్యులే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బు దాచుకున్న వారిలో తొలుత ఆత్రుత పెరుగుతుందని అది రానురానూ మానసిక ఒత్తిడిని పెంచి గుండెపోటుకు దారి తీస్తుందని చెబుతున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -