Friday, May 17, 2024
- Advertisement -

ప‌చ్చ‌మీడియా ఛాన‌ల్స్‌ను క‌ట్ట‌డి చేడం ప‌వ‌న్ వ‌ల్ల అవుతుందా….?

- Advertisement -

దేశంలో మీడియాను , న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను మేనేజ్ చేయ‌డంలో చంద్ర‌బాబును మించిన నేత ఎవ‌రూ లేరు. జాతీయ మీడియా అయినా లోక‌ల్ మీడియా అయిన స‌రే. ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా అలానే త‌యార‌య్యింది. ఇక తెలు రాష్ట్రాల్లో ఉన్న మేజ‌ర్ మీడియా సంస్థలు అన్నీ బాబు చెప్పుచేతుల్లో పెట్టుక‌న్న సంగ‌తి తెలిసిందే.

త‌న అనుకూల మీడియాతో చంద్ర‌బాబు ఎంత‌టి నీచానికి దిగ‌జారుతున్న‌రో తెల‌సిందే. ఎలాంటి చేయకూడని పనులు చేయిస్తున్నారో మరోసారి తెలుగు ప్రజలకు తెలిసొచ్చింది. టీవీ9, ఏబీఎన్, టీవీ5 కలిసి తన తల్లిని అనరాని మాటలన్నారని, వాళ్లపై న్యాయ పోరాటం చేస్తానని పవన్ ఓపెన్ గా ప్రకటించారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా జ‌గ‌న్ ప‌చ్చ‌మీడియా చాన‌ల్లోతో అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడ‌తో కంటే ప‌చ్చ మీడియాతోనే జ‌గ‌న్ ఎక్కువ‌గా పోరాడుతున్నారు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను ఎలా స‌ర్వ‌నాశ‌నం చేశారో అంద‌రికీ తెల‌సిందే.

ప్రభుత్వ పథకాలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు లాంటి అంశాలతో పాటు చంద్రబాబుకు సంబంధించిన అవినీతి వ్యవహారాలపై బాబు అనుకూల మీడియా ఎలాంటి వార్తలు వండివారుస్తోందనే విషయాన్ని జగన్ ఎప్పటికప్పుడు జనాలకు చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు కుయుక్తులకు కొన్ని ఛానెల్స్ ఎలా మద్దతు పలుకుతున్నాయో, తనపై ఎలా బురుద జల్లుతున్నాయో సాక్ష్యాలతో పాటు వివరిస్తున్నారు.

అయినా కూడా జ‌గ‌న్ విజ‌యం సాధించారంటే స్వ‌ల్ప‌మే చెప్పాలి. ఇప్పుడిప్పుడే ప‌చ్చ‌మీడియా ఎలా వ్య‌వ‌హ‌రిస్తూందో ప్ర‌జ‌ల‌ల్లో అవ‌గాహ‌న తీసుకున్నా ఛాన‌ల్స్‌ను మాత్రం క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నారు. జ‌గ‌న్ చేయ‌లేని క‌ట్ట‌డి ప‌వ‌న్ చేయ‌గ‌ల‌డా అన్న‌ది చూడాల్సిఉంది.

ప‌చ్చ ఛానెల్స్ పై సుదీర్ఘ న్యాయ‌పోరాటం చేస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ లీగల్ పోరాటమైనా ఆ ఛానెల్స్ ను దారిలోకి తీసుకొస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -