“నా సావు నేను చస్తా”అన్న ఒకే ఒక్క డైలాగ్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటుడు ప్రియదర్శి. పెళ్లి చూపులు సినిమా ద్వారా తెలుగు అరంగేట్రం చేసిన నటుడు ఆ తర్వాత పలు చిత్రాలలో కనిపించే సందడి చేశారు. ప్రస్తుతం ఎన్నో సినిమాలతో బిజీగా ఉన్న ప్రియదర్శి తాజాగా కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన “జాతిరత్నాలు” సినిమా ద్వారా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇదివరకు నటుడు ప్రియదర్శి సినీ జీవితం గురించి మనకు తెలుసుకున్నాము కానీ తన వ్యక్తిగత జీవితం గురించి తన భార్య గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం.. రీఛా శర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియదర్శి తనకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగా ఉందని పలు సందర్భాలలో తెలియజేశారు. ఇకపోతే తను గతంలో సినిమాల ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు తనకు అవసరం అయ్యే ఖర్చులు అన్నింటిని రీఛా శర్మ భరించేది అని తెలిపారు.
Also read:అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?
ప్రియదర్శి తండ్రి పులికొండ సుబ్బాచారి ప్రొఫెసర్ గా పని చేసేవారు. ఇప్పటికే తను ఎన్నో పద్యాలు నవలలు రాశారు అని తన భార్య రీఛా శర్మ వృత్తిపరంగా నవలా రచయిత అని ఇప్పటికే ఆమె పలు నవలలు కూడా రాసినట్లు ప్రియదర్శి తెలిపారు. ఇప్పటి వరకు కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన ప్రియదర్శి మొట్టమొదటిసారిగా క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.