ప్రేమించినట్లు నటించి.. చాలాకాలం అలానే.. చేసక.. తీర పెళ్లి విషయంకు వచ్చేసరికి.. అనంతరం ఆమెను మట్టుబెట్టాలని ప్లాన్ చేసాడు ఓ వ్యక్తి. ప్రేమించిన అమ్మాయిని గోదావరిలోకి తోసేసి పరార అయ్యాడు. విషయంలోకి వెళ్తే… రాజమహేంద్రవరం చెందిన గండి అలివేణి, నాసిక శ్రీనివాసరావు ఇద్దరూ.. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
{loadmodule mod_custom,GA1}
వీరి ఇళ్లులు ఎదురు ఎదురుగా ఉండటంతో.. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎంబీఏ చదివిన అలివేణి ఉప్పలగుప్తం మండలం సూరసేన (ఎస్)యానాంలో కెయిర్న్ ఎనర్జీలో ఎక్సెస్ కంట్రోలర్గా పనిచేస్తుంది. శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో సొంతంగా వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం బైక్పై అలివేణి వద్దకు శ్రీనివాస్ ఎస్.యానాం వచ్చాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోమని అలివేణి అడగటంతో.. ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. పెళ్లికి కులం అడ్డం అనే కోణంలో వీరిద్దరి వాదనాలు జరుగుతున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వర దేవాలయంలో వివాహం చేసుకుందామని చెప్పడంతో వీరిద్దరూ కలిసి ఆదివారం రాత్రి అమలాపురంలో భోజనం చేసి అనంతరం బయలు దేరారు.
{loadmodule mod_custom,GA2}
యానాం ఎదుర్లంక బాలయోగి వారధి వద్దకు వచ్చేసరికి ఇద్దరూ కలిసి వంతెన వద్ద ఆగారు. ఈ క్రమంలో అలివేణిని బలవంతంగా కొట్టి పీక నులిమి బ్రిడ్జిపై నుంచి తోసేసి పరారయ్యాడు. తెల్లవారు జాము కావడంతో అక్కడ ఉన్న మత్స్యకారులు అమెను ఒడ్డుకు చేర్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ప్రమాద వార్తను తెలుసుకున్న ఐపోలవరం ఎస్ఐ టి.క్రాంతికుమార్ బాధితురాలి వాంగ్మూలం విని కేసు నమోదు చేశారు.
{youtube}tmdIAaKJsEA{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
