భూమ కుటుంబం నుంచి తల్లి శోభనాగిరెడ్డి మరణాంత్రం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎకగ్రీవంగా ఎన్నికైనా భూమ అఖిల ప్రియ రెడ్డి ఇప్పుడు మినిస్టర్ అఖిల ప్రియ రెడ్డి అయిపోయింది. తాత ఎస్వీ సుబ్బారెడ్డి తర్వాత ఆ కుటుంబం నుంచి వారసురాలిగా అతి చిన్న వయసులోనే క్యాబినెట్ మంత్రి కాగలిగింది.
2014 ఎన్నికలలో ఆళ్లగడ్డ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో దిగిన శోభనాగిరెడ్డి… ప్రచారంలో భాగంగా ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. తరువాత తన వారసురాలు గా భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గా ఎన్నికైంది. కోద్దిరోజుల తరువాత తండ్రి భూమ నాగిరెడ్డి తో కలసి టీడీపీ లో చేరిపోయారు. ఇది ఇలా ఉండగా తండ్రి భూమ నాగిరెడ్డి గుండె పోటు తో హటాత్ గా మరణించారు.. తండ్రి భూమ నాగిరెడ్డి చనిపోకముందు మంత్రి పదవి కోసమే టీడీపీ లో చేరినట్టు వార్తలు వచ్చాయి.
ఏదేమైనప్పటికి అప్పుడు తల్లి మరణంతో ఎమ్మెల్యే… ఇప్పుడు తండ్రి మరణంతో మంత్రి పదవులను దక్కించుకున్న భూమ అఖిల ప్రియ రెడ్డి కీ ఇది అదృష్టమా? దురదృష్టమా?? ఏమనుకోవాలి???
{youtube}oedoKWsY7IM{/youtube}