Sunday, May 12, 2024
- Advertisement -

ఇలాంటి పనులు చేయొద్దు..!

- Advertisement -

ఇప్పటికే వరస విదేశీ పర్యటనలతో పరువు పోగొట్టుకొంటున్నాడు నరేంద్రమోడీ. దేశంలో కన్నా దేశం ఆవలే ఎక్కువ సమయం ఉంటున్నాడు..

ఏదో అద్భుతాలు చేస్తాడనుకొంటే ఏమీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి ప్రధాని మీద. మరి ఆ విషయంలో ఎలాగో కవర్ చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి దేశం కోసమే విదేశీ పర్యటనలు చేపడుతున్నాడు…

అంతర్జాతీయ స్థాయిలో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుస్తున్నాడనే నెపంతో కవర్ చేసుకొంటున్నారు. మరి ఇంత వరకూ బాగానే ఉందికానీ.. ఇలా అయితే సమర్థించుకోవచ్చు కానీ.. తాజాగా అమెరికాలో నరేంద్రమోడీ వ్యవహరణ తీరు విమర్శలకు దారి తీస్తోంది.

భారత త్రివర్ణ పతాకం మీద మోడీ సంతకం చేసి.. దాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గిఫ్ట్ గా ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది. త్రివర్ణపతాకాన్ని బహుమతిగా ఇవ్వడం సంగతి ఎలా ఉన్నా.. దానిపై నరేంద్రదమోడీ ఆటోగ్రాఫ్ చేయడమే విమర్శలకు కారణం. త్రివర్ణ పతాకాన్ని గౌరవించడంలో కొన్ని నిబంధనలున్నాయి. దానిపై ఎలాంటి రాతలూ చేయకూడదు. అలాంటిది మోడీ ఏకంగా త్రివర్ణ పతాకంపై ఆటోగ్రాఫ్ చేశాడు.

ఇది మోడీ అభిమానులు కూడా ఏ మాత్రం సమర్థించలేని పని. ఎంత ప్రధానమంత్రి అయినా.. ఎంత మోడీ అయినా.. త్రివర్ణపతాకం కన్న ఆయనేమీ ఎక్కువ కాదు. కానీ మోడీగొప్పగా ఫీలయిపోతూ.. జాతీయ పతాకం మీద పెన్నుపెట్టాడు. దీనిపై అనేక మంది మండిపడుతున్నారు. ఇంటర్నెట్ లో మోడీకి వ్యతిరేకంగా ట్వీట్ ట్రెండ్ నడుస్తోంది. మీకంత సీన్ లేదు మోడీ.. ఇలాంటి చేష్టలు చేయకండి అంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -