Friday, March 29, 2024
- Advertisement -

జగన్ కూతురిపై సీనియర్ టిడిపి నేత నీచ వ్యాఖ్యలు….. విరుచుకుపడుతున్న నెటిజనులు

- Advertisement -

చంద్రబాబు రాజకీయాల గురించి కొత్తగా చెప్పేదేముంది? ఏ కులం నాయకుడిని తన పార్టీలో ఉన్న అదే కులం నాయకుడితో తిట్టించడం….. ఇక ప్రత్యర్థి నాయకుడి తల్లిదండ్రుల నుంచీ పిల్లల వరకూ అన్ని విషయాలపై నీచంగా వ్యాఖ్యలు చేయడంలాంటివన్నీ రాజకీయాల్లో చంద్రబాబు తీసుకొచ్చిన మార్పులే. ఇక తాజాగా ఇందిరాగాంధీ మాడిమసైపోయింది అని వ్యాఖ్యానించాడు ఆయన పుత్రరత్నం లోకేష్. అదీ టీడీపీ స్థాయి.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అధినాయకుడు, ఆయన పుత్ర రత్నం అంత దిగిజారిపోయాక ఇక ఆ పార్టీ నేతలు ఇంకెంత దిగజారుతారో ప్రత్యేకంగా చెప్పాలా? తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న కూడా అదే స్థాయి వ్యాఖ్యలు చేశాడు. బాబును భుజాన మోసే బూతు మీడియా యజమాని నుంచి స్క్రీప్ట్ అందుకున్నాడో ఏమో తెలియదు కానీ జగన్ కూతురిపై విమర్శలు చేశాడు. లండన్‌లో విజయ్ మాల్యా ఇంట్లో ఉండి జగన్ కూతురు చదువుకుంటోందని, రోజూ విజయ్ మాల్యా ఇంటి నుంచే కాలేజ్‌కి వెళ్ళి చదువుకుంటోందని వ్యాఖ్యలు చేశాడు బుద్ధా వెంకన్న.

ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో సీటు సంపాదించడం ఎంత కష్టమో మన ఎన్ఆర్ఐలను అడిగితే చెప్తారు. నెట్‌లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. కానీ టిడిపి నేతలు మాత్రం రాజకీయ బురదచల్లడం కోసం జగన్ కూతురిపై కూడా విమర్శలు చేశారు. మహిళలపై ఎంతో గౌరవం అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమని స్పందిస్తాడో చూడాలి. కాకపోతే బాబు కంటే ముందు సోషల్ మీడియా స్పందించింది. చాలా మంది నెటిజనులు రెస్ట్ ఇన్ పీస్ టీడీపీ అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. 2019లో టిడిపికి సమాధి కట్టడం ఖాయం అని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -