Sunday, May 19, 2024
- Advertisement -

పోలవరం అవినీతి… మోడీ దగ్గర విదేశాల్లో బాబు ముడుపులు తీసుకున్న సాక్ష్యాలు

- Advertisement -

తనపైన కేంద్రం దాడి చేయడానికి సిద్ధపడుతోందన్న రేంజ్‌లో బాబు మాట్లాడుతున్నాడు…..అలా దాడి చేస్తే ప్రజలందరూ తనకు మద్దతుగా నిలబడాలని కామెడీగా పిలుపు ఇస్తున్నాడు. అయినా ప్రజాస్వామ్యంలో మద్దతు ఇవ్వడం అంటే ఓట్లు వేసి గెలిపించడమే. అలా ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ ప్రజల మద్దతు కావాలంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేయడం బహువిచిత్రం. అయినా ఆంధ్రప్రదేశ్ ఏమైనా వేరే దేశమా? కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుందా బాబు పైన? కానీ బాబుగారు మాత్రం ఆ స్థాయిలో హంగామా చేస్తున్నారు.

బాబు హంగామా పక్కనపెడితే ఢిల్లీ స్థాయిలో బాబు అవినీతి గురించి కథకథలుగా వార్తలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి గురించి తాజాగా హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టుల్లో అవినీతి ఏరులైపారిందని……. ఆ అవినీతి సొమ్మును చంద్రబాబు విదేశాల్లో తీసుకున్నాడని…. అందుకు సంబంధించిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని ఆ మధ్య జైరాం రమేష్ చంద్రబాబుని హెచ్చరించాడు. చంద్రబాబు విదేశాల్లో ముడుపులు తీసుకున్న ఆ ఆధారాలే కేంద్రం దగ్గర ఉన్నాయని, వరుసగా చంద్రబాబును కలుస్తున్న కేంద్ర ప్రతినిధులు అదే విషయాన్ని చంద్రబాబుకు చెప్తున్నారని తెలుస్తోంది. బయటికి ఏం మాట్లాడుతున్నా గవర్నర్‌తో సహా ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌లాంటి వాళ్ళతో చంద్రబాబు వరుస భేటీలు మాత్రం తీవ్రస్థాయిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సాక్ష్యాధారాలతో సహా కేంద్రం చర్యలు తీసుకుంటే మాత్రం చంద్రబాబు ఎంత మొసలి కన్నీరు కార్చినా, సెంటిమెంట్ డ్రామాలు పండించినా ప్రజలు కరిగిపోయి 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలిపించే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చుట్టూ ముసురుకుంటున్న ఈ సంకట స్థితుల నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారో అన్న టెన్షన్స్ అయితే టిడిపి నాయకుల్లో, శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -