Sunday, April 28, 2024
- Advertisement -

వైర‌ల్ అవుతున్న ఫోటోలు…మ‌ద్ద‌తునిస్తున్న ప్ర‌జ‌లు…

- Advertisement -

బెంగ‌ళూరు రోడ్ల మీదికి సాగ‌ర క‌న్య ఈత కొడుతోంది. సాగ‌ర క‌న్య ఏంది రోడ్ల మీద‌కు వ‌చ్చింది అనుకుంటున్నారా …మీరు విన్న‌తి నిజ‌మే. అది నిజ‌మైన సాగ‌ర‌క‌న్య‌కాదులేండి. ఆకుప‌చ్చ శ‌రీరంతో రోడ్ల మీద ఉన్న గుంత‌ల్లో ఈత కొడుతోంది. ఈ ఫోటోలు పెద్ద వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌జ‌లు కూడా దీనికి మ‌ద్దతు తెలుపుతున్నారు.

ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు రోడ్ల మీద ప‌డిన గుంత‌ల వ‌ల్ల బెంగ‌ళూరు ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న అవ‌స్థ‌లు తెలిసిందే. ప్ర‌జ‌ల బాధ‌ల‌ను ప్ర‌భుత్వాల‌కు తెలియజేసేందుకు ఆర్టిస్ట్ బాద‌ల్ ఇలా వినూత్నంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ గుంత‌ల కార‌ణంగా న‌లుగురు మృత్య‌వాత ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

సాగ‌ర క‌న్య‌లాగ దుస్తులు ధ‌రించి న‌డిరోడ్డు మీద గుంత‌ల్లో రంగు నీళ్లు పోసి ఇలా నిర‌స‌న తెలియ‌జేస్తున్న బాద‌ల్‌కు బెంగ‌ళూరు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. మ‌రోప‌క్క ఆమె సాగ‌ర క‌న్య‌లాగ పోజులిచ్చిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె ఫొటోల‌ను షేర్ చేస్తూ రోడ్ల మీది గుంత‌ల‌కు నిర‌స‌నలో ఆమెకు నెటిజ‌న్లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. బాదల్ నిరసనతోనైనా బెంగళూరులో గుంతల నుంచి ప్రజలకు విముక్తి కల‌గాల‌ని కోరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -