గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా గుణశేకరుడి రుద్రమ దేవి హవానే నడుస్తోంది, ఆ సినిమా ని గుణ శేకర్ మూడేళ్ళ పాటు కష్టపడి తెరకి ఎక్కించిన వేళలో రుద్రమదేవి భారీ గా శుక్రవారం విడుదల అయ్యి మంచి ఓపెనింగ్స్ సంపాదించుకుంది.
కాకతీయ సామ్రాజ్యాన్ని తన ధైర్య, సాహసోపేతమైన నిర్ణయాలతో పాలించిన వీరనారి రాణీ రుద్రమదేవి కథగా తెరకెక్కిన సినిమా కావడంతో ‘రుద్రమదేవి’ సినిమాపై మొదట్నుంచే విపరీతమైన పాజిటివ్ బజ్ నడిచింది.
అనుష్క , అల్లూ అర్జున్ ల క్యారెక్టర్ లని గుణ శేకర్ చాలా అద్భుతంగా తెరకి ఎక్కించారు అని అంటున్నారు. ఈ సినిమా కి ఎందఱో ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉండగా , తాజాగా రాజకీయ నాయకులు సైతం రుద్రమదేవి సినిమా మీద ప్రశంసలు కురిపించారు.
నిన్న సాయంత్రం తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకి ప్రత్యేక షో ని ఏర్పాటు చేసి రుద్రమ దేవి చూపించారు. . ఈ షోకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక షో పూర్తయ్యాక వీరు మాట్లాడుతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.