హిందూ పురాణాల ప్రకారం కొందరు వ్యక్తులు ఇప్పటికీ కొన్ని యుగాల నుంచీ బతికే ఉన్నారట. వారిలో మొదటివాడు బలిచక్రవర్తి. శ్రీమహావిష్ణువుచే పాతాళ లోకానికి తొక్కబడిన బలి చక్రవర్తి ఇప్పటికీ బతికే ఉన్నాడట.
ప్రతి ఏటా ఒక రోజున అతను పాతాళ లోకం నుంచి భూమిపైకి వస్తాడట. అదే రోజున కేరళ వాళ్లు ఓనమ్ పండుగ జరుపుకుంటారు. ఇక రెండవవ్యక్తి రావణుడి తమ్ముడు విభీషణుడు. ఇతను రాముడికి యుద్దంలో సహకరిస్తాడు. దీంతో రాముడు ఇతనికి మరణం లేకుండా మృత్యుంజయునిగా చేస్తాడు. మహాభారతాన్ని రాసిన వేద వ్యాస మహర్షి కూడా మృత్యుంజయుడే. సాక్షాత్తు విష్ణుమూర్తి రూపమైన ఈయన ఇప్పటికీ భూమిపై ఉన్నాడట. అలాగే పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, మార్కండేయ మహర్షి, ఆంజనేయ స్వామి కూడా ఈ భూమి మీద ఇప్పటికీ నడయాడుతూనే ఉన్నారని పండితులు చెబుతున్నారు.
{youtube}boOOBBzDRis{/youtube}