Thursday, April 25, 2024
- Advertisement -

తండ్రి మరణ రహస్యం గురించి చెప్పిన సురేఖా వాణి కూతురు?

- Advertisement -

సురేఖ వాణి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 40 వయసులో కూడా సోషల్ మీడియాలో తన కూతురు సుప్రీతతో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తమకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సురేఖ వాణి కూతురు సుప్రీతకి కూడా సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంది.

ఈ క్రమంలోనే సుప్రీత సరదాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే సుప్రీత తన తండ్రి సురేష్ తేజ మరణం గురించి చెబుతూ కొంతవరకు ఎమోషన్ అయ్యారు.అసలు తన తండ్రి ఏవిధంగా మరణించాడు అనే విషయం సుప్రీత బయటపెట్టారు.

Also read:‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

తన తండ్రి సురేష్ తేజ టీవీ డైరెక్టర్ అని తనకు నాన్నతో ఎంతో అనుబంధం ఉండేదని తెలిపారు. నాన్నతో కలిసి బాగా అల్లరి చేసే డాన్నాని తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. చనిపోయే రోజు కూడా తన తండ్రికి ఏం జరిగిందో అనే విషయాన్ని కూడా బయటపెట్టారు. సాధారణంగా నాన్నకు ఎక్కువగా నడిచే అలవాటు ఉండేది. ఒకసారి నాన్నకు ఎక్కువ నొప్పి రావడంతో డాక్టర్లు ఇన్ఫెక్షన్ అయ్యిందని కాలి వేళ్ల వరకు తీసేస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుందని చెప్పారు. సర్జరీ చేసిన తర్వాత కూడా మరోసారి ఇన్ఫెక్షన్ రావడం, అదే సమయంలోనే హార్ట్ ఎటాక్ రావడంతో 2019లో నాన్న మరణించారనే విషయం సుప్రీత బయట పెట్టారు. ఇప్పటికీ తన తండ్రి మరణం తమను ఎంతో వెంటాడుతోందని సుప్రీత గుర్తు చేసుకున్నారు.

Also read:నలబై ఏళ్లకు పిల్లలు, భర్త మరణం.. రాత్రి వాళ్ళు అలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -