ఓ పోలీస్ భార్య మరో పోలీస్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో సంచలనం రేపింది. ఒక కానిస్టేబుల్ ఆర్ముడ్ విభాగంలో పని చేస్తున్నాడు. అయితే.. ఆ కానిస్టేబుల్ భార్య ఇంకో కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ కానిస్టేబుల్ విస్కీలో ఎలుకలమందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
విషయంలోకి వెళ్తె… పాలకొల్లులోని బ్రాడీపేటకు చెందిన వ్యక్తి జిల్లాలోని ఆర్ముడ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడు ఏఆర్ హెడ్క్వార్టర్లో ఎస్కార్ట్ డ్యూటీ చేస్తున్నాడు. అయితే ఇదే విభాగంలో పని చేస్తోన్న మరో కానిస్టేబుల్ శ్రీనివాస్ అతడి భార్య వాసవితో వివాహేతరసంబంధం పెట్టుకున్నాడు. గత ఐదు నెలలుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
వాసవి – శ్రీను వివాహేతర సంబంధం ఆమె భర్తకు విషయం తెలియడంతో ఆమె పిల్లలను తీసుకుని నిడదవోలులో పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఫోన్ చేయకపోవడం, తన భార్య, పిల్లలను కానిస్టేబుల్ శ్రీనివాస్ దూరం చేశాడని తీవ్ర మనస్థాపానికి గురైన ఆ కానిస్టేబుల్ విస్కీలో ఎలుకలముందు కలుపుకుని తాగేశాడు.
ఈ సంగతిన్ని.. ఇంకో ఆఫీసర్కు ఫోన్లో చెప్పడంతో కొందరు పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని వెంటనే ఏలూరు ప్రభుత్వాసుపత్రి లో చేర్పించారు. బాధితుడు పోలీసులకు తన భార్య వాసవి-శ్రీనివాస్ గురించి వాంగ్మూలం ఇచ్చాడు.
Related