ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్ భారత్ టీమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో వార్నర్, స్మిత్ లేకపోయినా ఆసీస్ పర్యటనలో భారత్ జట్టుకి క్లీన్స్వీప్ తప్పదని తెలిపారు. భారత్ బలంగా కనిపిస్తున్నా టెస్ట్ సిరీస్ను గెలవలేదని అన్నారు. ఈనెల 21 నుంచి టీమిండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్ని కంగారూలతో ఆడనుంది.
ఇప్పటికే అక్కడికే చేరుకున్న భారత్ జట్టు.. బ్రిస్బేన్ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్లపై ఏడాది నిషేధం వేటు పడగా.. భారత్తో పోలిస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా టీమ్ బలహీనంగా కనిపి స్తున్నా కానీ…నాలుగు టెస్టుల సిరీస్ని 4-0తో గెలుచుకోగల సత్తా ఆస్ట్రేలియాకి ఉందని మెక్గ్రాత్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా జట్టులో యువ బ్యాట్స్మెన్కు ఇది మంచి అవకాశమని….వాళ్లు బాగా ఆడగలిగితే టీమ్లో చోటును ఖాయం చేసుకుంటారన్నారు. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోటీ కావడంతో సిరీస్ ఆసక్తికరంగా జరగనుంది. అయితే.. టెస్టు సిరీస్ని 4-0తో చేజిక్కించుకోగల సత్తా ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టుకి ఉంది’ అని మెక్గ్రాత్ ధీమా వ్యక్తం చేశాడు.