భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి, తాను ఎంతో ఇష్టపడే కోచ్ రవిశాస్త్రి నుంచి ఓ సవాల్ ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి వన్డే పోటీల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరాడా అనుకుంటున్నారా? కాదు. అక్షయ్ కుమార్ ప్రారంభించిన ‘ప్యాడ్ మాన్’ సవాల్ ను స్వీకరించాలని. మహిళలు నెలసరి సమయంలో వాడే శానిటరీ ప్యాడ్ ను తన చేత్తో పట్టుకుని ఫోటో దిగి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన రవిశాస్త్రి, అదే పని చేసి చూపించాలని కోహ్లీకి సవాల్ విసిరాడు.
రాక్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రారంభించిన ‘ప్యాడ్ మ్యాన్’ ప్రచారానికి తాను మద్దతిస్తున్నానని చెప్పాడు. తన సవాల్ కోహ్లీతో పాటు గౌతమ్ సింఘానియా, లియాండర్ పేస్ లకు కూడా వర్తిస్తుందని చెప్పాడు. ఈ విషయంపై అక్షయ్ కుమార్ బహిరంగ చర్చ లేపడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నాడు. తన చేతిలోని ప్యాడ్ ను చూపుతూ రవిశాస్త్రి పెట్టిన పోస్టుకు వేల కొద్దీ లైక్స్ వస్తున్నాయి.
సామాజిక సమస్యలపై పోరాడేందుకు, బాధిత వర్గాలకు మద్ధతు తెలిపేందుకు ఇలాంటి సవాళ్లు స్వీకరించాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇదేవిధంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఓ శానిటరీ ప్యాడ్తో పోస్ట్ పెట్టింది. విస్తృత ప్రచారం కల్పించాలని కోరింది. తమిళనాడుకు చెందిన మురుగనాథమ్ జీవితం ఆధారంగా ప్యాడ్మ్యాన్ మూవీ తెరకెక్కించారు. రుతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లు రూపొందించి ఎంతో కృషి చేశారు మురుగనాథమ్. వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించిన కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు మూడో వన్డేలో నెగ్గి సిరీస్లో ఆధిక్యాన్ని 3-0కి పెంచుకుని తమ సత్తా చాటేందుకు సంసిద్ధమైంది.
Yes, it’s a Pad in my hand. Happy to support rockstar @akshaykumar for breaking the taboo and initiating an open conversation. AK, am sure no ball is going to hit PAD (MAN). #PadManChallenge Here I challenge @imVkohli @SinghaniaGautam @Leander pic.twitter.com/FXdK3py7gW
— Ravi Shastri (@RaviShastriOfc) February 6, 2018