అప్ఘానిస్థాన్ జట్టుతో జరుగనున్న ఏకైక టెస్ట్కు 8 మంది టీమిండియా స్టార్ క్రికెటర్లు దూరం కానున్నారు. ఇటీవలే టెస్ట్ హోదాను పొందింది. ఐపీఎల్ ముగిశాక.. బెంగళూరు వేదికగా జూన్ 14 నుంచి ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. సర్రే తరఫున కౌంటీల్లో ఆడనున్న కోహ్లి ఈ మ్యాచ్కు దూరం అవుతున్నాడు. కోహ్లితోపాటు 8 మంది భారత క్రికెటర్లు ఈ టెస్టుకు దూరం కానున్నారని తెలుస్తోంది
అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, అజింక్య రహానే, ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్, శిఖర్ ధావన్లు అప్ఘాన్తో జరగబోయే టెస్టు ఆడటం లేదని సమాచారం. ఇంగ్లాండ్లో ఈసారి ఎలాగైనా టెస్టు సిరీస్ నెగ్గాలని బీసీసీఐ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు వీరంతా ముందుగానే బయల్దేరి వెళ్తారని తెలుస్తోంది. ఐపీఎల్ ముగియగానే కోహ్లి, అశ్విన్ కౌంటీలు ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్తారు. ఇప్పటికే ఇషాంత్, పుజారా కౌంటీల్లో ఆడుతున్నారు.
అప్ఘాన్ టెస్ట్, ఇంగ్లాండ్ టూర్, ఐర్లాండ్తో రెండు వన్డేల సిరీస్ కోసం భారత సెలక్టర్లు మంగళవారం మూడు జట్లను ఎంపిక చేయనున్నారు. జూన్ 21 నుంచి ఇండియా-ఎ కూడా బ్రిటన్లో పర్యటించనుంది