- Advertisement -
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్రం రద్దు చేసిన సగతి తెలిసిందే. ఈ నిర్ణయం పై పాక్ పాలకు భారత్ పై విషయం కక్కుతున్నారు. ఇదలా ఉంటె పాక్ కెప్టెన్ సర్పరాజ్ బక్రీద్ రోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇది కశ్మీరీ సోదరులకు కష్ట కాలంగా సర్పరాజ్ అభివర్ణించాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించేందుకు కశ్మీరీలకు అల్లాను సాయం చేయాలని తాను ప్రార్థించినట్లు తెలిపాడు. కశ్మీర్ సోదరులకు యావత్ పాక్ అంతా అండగా ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరాచీలో ఈద్ ప్రార్థనలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పరాజ్ ఆర్టికల్ 370 రద్దుపై పైవిధంగా స్పందించాడు. అంతకుముందు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సైతం ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.