త్వరలో ఇంగ్లండ్తో జరగనున్న యాషెస్ టెస్ట్ సిరీస్కు తమ జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. బాల్ ట్యాంపరింగ్ కారణంగా నిషేధానికి గురయిన ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్క్రాఫ్ట్లు తొలి టెస్టు పర్యటనలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.ఇంగ్లండ్ వేదికగా ఆగస్టు 1వ తేదీ నుంచి ఆరంభం కానున్న యాషెస్ సిరీస్లో పాల్గొనే జట్టులో ఈ ముగ్గురూ చోటు దక్కించుకున్నారు.
యాషెస్ టెస్ట్ కోసం 17 మంది ఆటగాళ్లతో కూడిన ఆసీస్ జట్టును శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. ఇందులో స్మిత్, వార్నర్తో పాటు బెన్క్రాఫ్ట్ కూడా చోటు దక్కింది. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో బాల్ ట్యాంపరింగ్ కారణంగా స్మిత్, వార్నర్, క్రాఫ్ట్లు సష్పెన్స్ను గురయిన సంగతి తెలిసిందే. వార్నర్, స్మిత్లకు ఏడాది పాటు నిషేధం విధించిన సీఏ.. బెన్క్రాఫ్ట్పై 9 నెలల నిషేధం విధించింది. ఈ నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత వార్నర్, స్మిత్లు వరల్డ్కప్లో పాల్గొన్నారు.
ఆసీస్ యాషెస్ జట్టు ..
టిమ్ పైన్(కెప్టెన్, వికెట్ కీపర్), బెన్క్రాఫ్ట్, ప్యాట్ కమిన్స్, మార్కస్ హారిస్, జోష్ హజల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, లబుస్కాంజ్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, మిచెల్ నాసెర్, జేమ్స్ పాటిన్సన్, పీటర్ సిడెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్