Tuesday, May 14, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బాయ్ చెప్పిన సానియా మీర్జా…

- Advertisement -

క్రికెట్‌లో ఫేవరెట్‌ జట్లంటే ముందు వినిపించే పేరు భారత్‌ – పాకిస్తాన్‌. అభిమానులనే కాక యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించే మ్యాచ్‌ ఏదైనా ఉందా అంటే అది దాయాదుల పోరే. అలాంటి ర‌స‌వ‌త్త‌ర పోరు మ‌రో సారి అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నుంది. ఆసియా క‌ప్‌లో భాగంగా దాయాది దేశాలు త‌ల‌ప‌డుతున్నాయి.

అద‌లా ఉంటే భారత టెన్నిస్ స్టార్ సానియాకు అరుదైన సమస్య వచ్చింది. భార‌త్, పాక్ మ్యాచ్ పంద‌ర్భంగా ఓ నెటిజ‌న్ మీరు ఎవ‌రికి మ‌ద్ద‌తు తెలుపుతారంటూ ప్ర‌శ్నించారు. దీంతో కాస్త అయోమయానికి గురైన సానియా మీర్జా తాను కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు.

మ్యాచ్‌ ప్రారంభం కావడానికి 24 గంటలు కూడా లేదు. కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే అడ్డమైన చెత్తవాగుడు వినాల్సి వస్తది. ఇదంతా వింటూ ఉంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా జబ్బు పడాల్సిందే. మరి ప్రెగ్నెంట్‌ అయిన నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానంటూ నిర్ణ‌యం తీసుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -