ఆసియా కప్లో భాగంగా సూపర్ 4లో పాక్ను మట్టికరిపించి బంగ్లా ఫైనల్కు చేరింది. తీవ్ర అవమానంతో దాయాది జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో 240 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన పాక్.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది.
బంగ్లాదేశ్ చేతుల్లో చిత్తుగా ఓడిన తమ జట్టుపై పాక్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. సర్ఫరాజ్ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 95 మ్యాచ్లు ఆడిన అతడు చేసింది రెండు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు మాత్రమే.. అలాంటి ఆటగాడు జట్టును నడిపిస్తున్నాడు. అమేజింగ్.. అంటూ సోషియల్ మీడియాలో కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
తమ దేశపు జట్టు ఇండియాతో హ్యాట్రిక్ పరాజయాలను తప్పించుకుందని, భారత్ తో మరో మ్యాచ్ ఆడి ఓడిపోయి ఇంటికి రావడం కన్నా, బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తక్కువ బాధను కలిగిస్తుందని ఆ దేశ క్రికెట్ ప్రియులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
రోహిత్ శర్మతో సర్ఫరాజ్ అహ్మద్ ను పోలుస్తూ, 95 మ్యాచ్ లు ఆడి, 8 ఫిఫ్టీలు, 2 సెంచరీలు చేసిన వ్యక్తి టీమ్ ను నడిపిస్తే ఇలాగే ఉంటుందని విమర్శిస్తున్నారు. ఆతను కెప్టెన్సీ వదులుకోవాలని సలహాలు ఇస్తున్నారు.
OUT! Sarfraz c Rahim b Mustafizur 10(7). Pakistan: 18/3 (3.3 ov). Live Updates: https://t.co/Vk5r5y4dig #PAKvBAN #AsiaCup2018 #HarSaansMeinBolo
— Pakistan Cricket (@TheRealPCB) September 26, 2018
OUT! Sarfraz c Rahim b Mustafizur 10(7). Pakistan: 18/3 (3.3 ov). Live Updates: https://t.co/Vk5r5y4dig #PAKvBAN #AsiaCup2018 #HarSaansMeinBolo
— Pakistan Cricket (@TheRealPCB) September 26, 2018
Match Summary: Bangladesh win by 37 runs.
More ▶️ https://t.co/Vk5r5y4dig #PAKvBAN #AsiaCup2018 pic.twitter.com/PyIIQkYkb6— Pakistan Cricket (@TheRealPCB) September 26, 2018