- Advertisement -
బర్మింగ్హామ్లో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసిస్ టీమిండియా మాదిరె ఇన్నింగ్స్ను కొనసాగించింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్లో స్మిత్ , కెర్రీ మినహా ఎవరూ రాణించేకపోయారు. స్టీవ్ స్మిత్(85), అలెక్స్ క్యారీ(46)లు రాణించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది.
ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఆసీస్ విలవిల్లాడింది. దీంతో కనీసం 200 పరుగులు దాటుతుందా అనుకున్నారు. అయితే స్మిత్, క్యారీలు ఆదుకున్నారు. చివర్లో మ్యాక్స్వెల్(26), స్టార్క్(29) రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, వోక్స్లు తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్ రెండు వికెట్లు, వుడ్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.