ఈ నెల 21 నుంచి భారత్తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా ఆరోన్ పింఛ్ సారథ్యంలో 13మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్తోపాటు స్పిన్నర్ నేథన్ లయన్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్లకు ఈ టీమ్లో స్థానం దక్కలేదు. భారత్తో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్తో పాటు, ఈ నెల 17న దక్షిణాఫ్రికాతో జరగనున్న ఏకైక టీ20కి కూడా ఇదే జట్టుని ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది.
పొట్టి ఫార్మాట్ అనంతరం భారత్తో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలోనే ఆ నలుగురికి టీ20 జట్టులో స్థానం కల్పించలేదని కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. వీళ్ల స్థానంలో మార్కస్ స్టాయినిస్, జేసన్ బెహ్రెండార్ఫ్లకు చోటు కల్పించారు. వరల్డ్కప్కు ముందు ఆస్ట్రేలియా సొంతగడ్డపై కొన్ని కీలకమైన సిరీస్లు ఆడబోతున్నది. దీంతో బెస్ట్ టీ20 టీమ్ను ఎంపిక చేయడంతోపాటు కీలకమైన ఆటగాళ్లను ఆ సిరీస్లకు సిద్ధం చేసే ఉద్దేశంతో ఉన్నామని కోచ్ తెలిపాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ అత్యంత దయనీయ స్థితిలో ఉంది. చివరి 19 వన్డేల్లో 17 మ్యాచుల్లో ఓడింది. ఇక తాజాగా పాకిస్థాన్ చేతిలో 0-3తో టీ20 సిరీస్ను కూడా ఓడిపోయింది.