ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పై మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ప్రస్తుత కామెంటేటర్ ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. ధోనీ తనపై తానే నమ్మకం కోల్పోయాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడిగిన చెన్నై.. మొదటి మ్యాచ్ లో ముంబై పై గెలిచినా.. తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. మొదటి మ్యాచ్ ను గెలిచినా ఆంబటి రాయుడు.. తర్వాత రెండు మ్యాచ్ లు గాయం కారణంగా ఆడలేదు.
ఆ ప్రభావం టీమ్పై ఉందని చోప్రా అన్నాడు. రాయుడు లేకపోవడంతో తుది జట్టులోకి ఒక బ్యాట్స్మెన్ని తీసుకున్న ధోనీ.. కేవలం ఐదుగురు బౌలర్లతోనే మ్యాచ్లు ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ధోనీ ఇలా ఐదు బౌలర్లతోనే తుది జట్టును ఎంచుకోవడం తాను చూడలేదని చోప్రా అన్నారు. ధోనీ తాను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి వెళ్లి శామ్ కరన్, కేదార్ జాదవ్లను ముందుకు పంపుతున్నాడు. కానీ.. ఈ ప్రయోగాలు కూడా ఫలించడం లేదు. దానికితోడు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, పీయూస్ చావ్లా ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ తడబాటుపై తన యూట్యూబ్ ఛానల్లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ” ధోనీ ఐదుగురు బౌలర్లతో మ్యాచ్ ఆడుతుండటం ఇదే మొదటిసారి. ధోనీ కూడా తన ఫామ్పై తానే నమ్మకం కోల్పోయినట్లున్నాడు. ఇక రవీంద్ర జడేజా ఫస్ట్ మ్యాచ్ నుంచి 4 ఓవర్లు వేస్తూ కనీసం 40 పరుగులు ఇచ్చేస్తున్నాడు. ధోనీ అతడ్ని అతిగా నమ్ముకుంటే ప్రయోజనం లేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
సన్ రైజర్స్ కు ఈసారి విలియమ్సన్ ఆడటం ఖాయమేనా..?
నిన్నటి పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ పై విమర్శల వెల్లువ..?