Friday, March 29, 2024
- Advertisement -

నిన్నటి పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ పై విమర్శల వెల్లువ..?

- Advertisement -

నిన్న  ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, పంజాబ్‌ చేజింగ్‌ చేస్తున్న సమయంలో 19వ ఓవర్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల విమర్శలు వస్తున్నాయి. రబాడ బౌలింగ్‌లో 18వ ఓవర్ మూడో బంతిని ఆడిన మయాంక్ రెండు పరుగులు చేస్తే.. మరో ఎండ్‌లో ఉన్న క్రిస్ జోర్డాన్ బ్యాటును క్రీజులో పెట్టలేదంటూ లెగ్ అంపైర్ నితిన్ మీనన్ ఓ పరుగును తొలగించారు.

ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తుండడంతో దీనిపై పంజాబ్‌ యజమాని ప్రీతిజింటా ట్విట్టర్‌ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను కరోనాను సంతోషంగా జయించానని, ఆరు రోజుల హోం క్వారంటైన్‌తో పాటు ఐదు కరోనా‌ పరీక్షలు హాయిగా పూర్తి చేసుకున్నానని చెప్పింది. అయితే, నిన్న చోటు చేసుకున్న ఒక షార్ట్‌ రన్‌ తనను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పుకొచ్చింది.

క్రికెట్‌లో టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని ప్రయోజనం ఏమిటని నిలదీసింది. బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చిందని ఆమె చెప్పింది. తాను ఎప్పుడూ ఆటలో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తానని ఆమె తెలిపింది. క్రికెట్‌ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కోరింది. భవిష్యత్‌లో తప్పులు మళ్లీ జరగకుండా చూడాలని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -