- Advertisement -
ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ముంబయి ఇండియన్స్తో చెపాక్ వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.జ్వరం కారణంగా ధోనీ ఈ మ్యాచ్కు విశ్రాంతి తీసుకున్నాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న మహీ సన్రైజర్స్తో మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకోగా.. ముంబయి మరో రెండు మ్యాచ్ల్లో గెలిస్తేనే టాప్-4కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ముంబయి మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో చెన్నైపై ప్రస్తుత సీజన్లో మరోసారి విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది