Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌డేజా బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్ బౌల్డ్‌…

- Advertisement -

ఐపీఎల్-11లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కష్టాల్లో పడింది. స్వల్ప స్కోరుకే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. కీలకమైన పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ స్కోరు 47/1. జడేజా వేసిన తరువాతి ఓవర్ మొదటి బంతికే కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌల్డయ్యాడు. దీంతో మైదానంలో కోహ్లీ(8: 11 బంతుల్లో ఫోర్)తో పాటు బౌలర్ జడేజా షాక్ అయ్యారు. వికెట్ పడగొట్టిన జడ్డూ ఎలాంటి సంబరాలు చేసుకోకుండా ప్రశాంతంగా అలానే ఉండిపోయాడు.

అంతకముందే ఓపెనర్ మెక్‌కలమ్ (5) కూడా ఎంగిడి బౌలింగ్‌లో ఔటవడంతో.. 6.1 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు 47/2తో నిలిచింది. ఓపెనర్ పార్థీవ్ పటేల్ ( 38: 26 బంతుల్లో 4×4, 2×6), ఏబీ డివిలియర్స్ క్రీజులో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -