- Advertisement -
ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా ఢిల్లీ డేర్డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్లాడిన బెంగళూరు జట్టు మూడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. 11 మ్యాచ్లాడి మూడు మ్యాచ్ల్లో గెలిచిన ఢిల్లీ జట్టు చిట్టచివరి (8వ) స్థానానికి పరిమితమైంది. టోర్నీలో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే.. బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉండగా.. ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించే అవకాశం ఉంది. గత మ్యాచ్లో భారీ శతకంతో చెలరేగిన రిషబ్ పంత్ను కట్టడి చేయడం బెంగళూరు బౌలర్లకు సవాల్తో కూడుకున్న విషయమే.