Tuesday, May 7, 2024
- Advertisement -

ఆ సీక్రెట్ చెబితే న‌న్ను జ‌ట్టు నుంచి తొల‌గిస్తారు – ధోని

- Advertisement -

తాజాగా జ‌రుగుతున్న ఐపీఎల్ 12 వ సీజ‌న్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని సార‌థ్యం వ‌హిస్తున్న చైన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఆ జ‌ట్టు ఎటువంటి స‌మీక‌ర‌ణ‌ల‌తో సంబంధం లేకుండానే ఫ్లే ఆఫ్‌కు చేరుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చైన్నై జ‌ట్టు 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ విజ‌య‌నంత‌రం ధోని మాట్లాడుతూ… జ‌ట్టులో అంద‌రు సమిష్టిగా రాణించ‌డం వ‌ల్లే ఇలాంటి విజ‌యాలు సాధ్యం అయ్యాయ‌ని చెప్పుకొచ్చాడు.

ఇక వ‌రుస విజ‌యాల‌కు కార‌ణం ఏంట‌ని అడిగిన ప్ర‌శ్న‌కు త‌నదైన శైలిలో స‌మాధానం ఇచ్చాడు ధోని. తాను ఈ ర‌హ‌స్యాన్ని చెబితే యాజ‌మాన్యం న‌న్ను జ‌ట్టు నుంచి తొలిగిస్తుందని చెప్పుకొచ్చాడు. వ‌రుస విజ‌యాలు వృత్తి ర‌హ‌స్య‌మని అది బ‌య‌టికి చెప్ప‌కూడ‌ద‌ని జ‌వాబిచ్చాడు ధోని.రిటైర్మెంట్ అయిన త‌రువాత ఈ ర‌హ‌స్యం బ‌య‌ట‌పెడ‌తాన‌ని , అప్ప‌టి వ‌ర‌కు నా నుంచి ఎటువంటి స‌మాధానం రాద‌ని పేర్కొన్నాడు. ఇక ఈ వ‌రల్డ్ క‌ప్ చాలా కీల‌కం అని, అందుకే ఐపీఎల్లో చాలా జాగ్ర‌త‌గా ఆడుతున్నాన‌ని తెలిపాడు. అభిమాన‌లు మ‌ద్ద‌తుతో పాటు, జ‌ట్టు యాజ‌మాన్యం ప్రోత్సాహాకాలు వ‌ల్లే ఇటువంటి విజ‌యాలు సాధ్యం అయ్యాయ‌ని చెప్పుకొచ్చాడు.

ఇక స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వాట్స‌న్ బ్యాటింగ్‌పై కూడా స్పందించాడు ధోని. వాట్స‌న్ మ్యాచ్ విన్న‌ర్ అని, కాక‌పోతే ఈ సీజ‌న్‌లో అత‌ను పెద్ద‌గా రాణించ‌పోయిన‌ప్ప‌టికి, వాట్స‌న్‌పై న‌మ్మకం ఉండ‌టంతోనే వ‌రుస అవ‌కాశాలు ఇచ్చామ‌ని తెలిపాడు. టోర్ని కీల‌క ద‌శ‌లో వాట్స‌న్ ఫాంలోకి రావ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పాడు ధోని

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -