Wednesday, May 22, 2024
- Advertisement -

వామ్మో. ఆ కథ కోసం ధోనీ డిమాండ్ 80 కోట్ల రూపాయల!

- Advertisement -

ఈ మధ్య కాలంలో బయో పిక్స్ సందడి ఎక్కువవుతోంది. లివింగ్ లెజెండ్ ల, సెలబ్రిటీల జీవిత కథల ఆధారంగా సినిమాలు వచ్చేస్తున్నాయి.

జీవితంలో సక్సెస్ అయిన వారి కథలను తెరపై చూపుతూ సొమ్ము చేసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ ధోనీ కథ ఆధారంగా కూడా ఒక సినిమా రానున్నది. మరి తన జీవిత కథ ఆధారంగా సినిమా తీయబోతున్నవారి నుంచి ధోనీ అడుగుతున్న రాయాల్టీనే ఇప్పుడు సంచలన స్థాయిలో ఉంది! 

80 కోట్ల రూపాయలు ఇచ్చిన తన జీవిత కథ ఆధారంగా సినిమా తీసుకొవచ్చని ఆఫర్ ఇచ్చాడట మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ జీవిత కథ ఆధారంగా సినిమా తీయడానికి దర్శకుడు నీరజ్ పాండే చాలా ఆసక్తితోఉన్నాడు. ఇది వరకూ ‘ఎ వెన్స్ డే’ ‘స్పెషల్ చబ్బీస్’ వంటి సంచలన సినిమాలను తీసిన నేపథ్యం ఉన్న దర్శకుడితను. ఇతడు ధోనీ బయోపిక్ పై చాలా ఆసక్తితో ఉన్నాడు.

మరి ఈ విషయంలో ధోనికి అంతిమంగా 20 కోట్ల రూపాయలు వరకూ ఇవ్వగలమని ఆ సినిమా యూనిట్ స్పష్టం చేసిందని సమాచారం. అయితే ధోనీ మాత్రం 80 కోట్ల రూపాయలకు తక్కువ అయితే.. సినిమాకు అనుమతిని ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన పంచాయతీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో ఎలా రాజీ పడతారో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -