ఈ నెల 7 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్దం అయ్యాయి.కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంఛైజీ ఇటీవల వేలంలో రూ. 5.8 కోట్లకి కుల్దీప్ యాదవ్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. . ఏడాది ముందు వరకూ కోల్కతా జట్టులో సునీల్ నరైన్, బ్రాడ్ హగ్కి ప్రత్యామ్నాయ బౌలర్గా ఉన్న కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది ప్రధాన స్పిన్నర్గా బరిలోకి దిగుతుండటం విశేషం.
ప్రస్తుతం కోల్కతా జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఈ మణికట్టు స్పిన్నర్ సన్నద్ధత గురించి మీడియాతో మాట్లాడాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీలను ఔట్ చేయడమే ఐపీఎల్ 2018లో తన టార్గెట్ అని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు
‘ఐపీఎల్ 2018లో నాకు ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు లేవని చెబితే అది అబద్దమే అవుతుంది. స్పిన్ని సమర్థంగా ఎదుర్కొనే విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోనీ వికెట్లను ఈ టోర్నీలో తీయడమే నా టార్గెట్. ఐపీఎల్లో మాత్రమే నాకు ఈ అవకాశం దొరుకుతుంది. గత ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఈ మణికట్టు స్పిన్నర్.. ప్రస్తుతం వన్డే, టీ20 జట్టులో తిరుగులేని స్పిన్నర్గా కొనసాగుతున్నాడు.