ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించినా చివరి వరకు పోరాడిన న్యూజిలాండ్ జట్టు క్రికెట్ మాత్రం అందరి మనసులు గెలుచుకుంది. ఎవరూ కూడా ఇంగ్లండ్ గెలిచినా ….న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందని చెబుతన్నారు. పంచకప్ ఫైనల్ టై కావడమే విశేషం అంటే.. తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడం సగటు క్రికెట్ అభిమానిని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అయితే చివరకు బౌండరీలు ఫలితాన్ని తేల్చడంతో న్యూజిలాండ్ ను మాత్రం తీవ్ర నిరాశపరిచాయి.
పుట్టెడు దుఖంలో… న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ పెట్టిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులందర్నీ అకట్టుకొంటోంది. ‘పిల్లలూ మీరెవరూ క్రీడల్లోకి రావొద్దు. మరి ఎదైనా ప్రొఫెషన్ తీసుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా ఆరోగ్యంగా చనిపోండి’ అంటూ జిమ్మీ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్కు అభినందనలు తెలియజేశాడు నీషమ్. ‘ఎంతగానో బాధిస్తుంది. ఈ మ్యాచ్లో ఆఖరి అరగంట గురించి నేను ఆలోచించని రోజులు రానున్న పదేళ్ల కాలంలో ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయని ఆశిస్తున్నాను.. కాంగ్రాట్స్ ఇంగ్లాండ్ అంటూ మరో పోస్టు పెట్టాడు.
నీషమ్ పెట్టిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకొంటోంది. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు మాత్రం నీషమ్ను ఓదార్చుతున్నారు. మీరు ఆడిన తీరు… ఎవరూ మరిచిపోలేరని భరోసా ఇస్తున్నారు. ఇంగ్లాండ్ టీం వరల్డ్ కప్ గెలిచినా… మీరంతా మా మనసు గెలుచుకున్నారంటూ మద్దతు తెలుపుతున్నారు.